. AP 6th Class Social Notes 8th Unit

Ticker

6/recent/ticker-posts

AP 6th Class Social Notes 8th Unit

AP 6th Class Social Notes 8th Unit రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు

→ షోడశ మహాజన పదాలలో మగధ శక్తివంతమైన రాజ్యంగా ఆవిర్భవించింది.

→ ఒకరాజు పరిపాలించబడే భూభాగాన్ని ‘రాజ్యం’ అంటారు.

→ సువిశాలమైన రాజ్యాలను ‘సామ్రాజ్యాలు’ అంటారు.

→ మౌర్య చంద్రగుప్తుడు కౌటిల్యుని సహాయంతో మగధ రాజ్యానికి రాజయి, మౌర్య (వంశ) సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వీరి రాజధాని పాటలీపుత్రం.

→ మెగస్తనీస్ ఒక గ్రీకు రాయబారి. ఇతను ‘ఇండికా’ అనే గ్రంథాన్ని రచించాడు.

→ కౌటిల్యుడిని విష్ణుగుప్తుడు మరియు చాణుక్యుడు అని కూడా పిలుస్తారు. ఇతను ‘అర్థశాస్త్రము’ అనే గ్రంథంను రచించినాడు.

→ అశోకుడు భారతదేశానికి తూర్పు తీరంలోని ‘కళింగ’ రాజ్యంపై యుద్ధం చేసాడు.

→ 13వ నంబరు రాతిశాసనంలో అశోకుడు కళింగ యుద్ధం గురించి ప్రస్తావించడం జరిగింది.

→ అశోకుని శాసనాలు ప్రాకృత భాషలో, బ్రహ్మి లిపిలో ఉన్నాయి.

→ ధర్మము అనే పదాన్ని ప్రాకృత భాషలో దమ్మము అని పిలుస్తారు.

→ నాలుగు సింహాల గుర్తు భారతదేశ జాతీయ చిహ్నం. దీనిని సారనాథ్ లోని అశోకుని శిలా స్తంభంలో నుండి స్వీకరించారు.

→ 1950 జనవరి 26 నుండి దీనిని అధికార చిహ్నంగా గుర్తించారు.

→ ‘సత్యమేవ జయతే’ అనే పదాన్ని ‘మండూకోపనిషత్’ నుండి గ్రహించబడింది.

→ గుప్తవంశ రాజులలో మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు ప్రసిద్ధి చెందిన రాజులు.

→ సముద్ర గుప్తుడు దక్షిణాధిన 12మంది రాజులను ఓడించాడు.

→ రెండవ చంద్రగుప్తుని కాలంలో తొమ్మిది మంది గొప్ప పండితులు ఉండేవారు. వీరినే నవరత్నాలు అంటారు.

→ నవరత్నాలలో ‘కాళిదాసు’ ప్రసిద్ధ కవి.

→ గుప్తుల వాస్తు శిల్ప కళా నైపుణ్యానికి అజంతా, ఎల్లోరా గుహలు గొప్ప ఉదాహరణలు.

→ భారతీయ శాస్త్రవేత్తలు ‘సున్నా’ భావనను అభివృద్ధి చేశారు.

→ బ్రహ్మగుప్తుడు గుప్తుల కాలంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. ఇతను పౌర సంవత్సరాన్ని దాదాపు ఖచ్చితంగా లెక్కించగల్గినాడు.

→ భారతదేశంలో మొట్టమొదటి ఉపగ్రహం పేరు ‘ఆర్యభట్ట’. దీనిని 1975లో అంతరిక్షంలోకి ప్రయోగించారు.

→ చరకుడు మరియు సుశ్రుతుడు గుప్తుల కాలంలో గొప్ప వైద్య పరిజ్ఞానం గల నిపుణులు.

→ గాయపడిన ముక్కులకు ‘ప్లాస్టిక్ సర్జరీ’ చేసిన మొట్టమొదటి భారతీయ శస్త్రచికిత్స నిపుణుడు సుశ్రుతుడు.

→ గుప్తుల కాలంలో శాస్త్రవేత్తలు లోహశాస్త్ర పరిజ్ఞానంలో నిపుణులు.

→ హుణుల దండయాత్ర వలన భారతదేశంలో గుప్త సామ్రాజ్యం అంతరించింది.

→ గుంటూరు జిల్లాలోని అమరావతి సమీపంలోని ధాన్యకటకం నుండి శాతవాహనులు పరిపాలించేవారు.

→ గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహన రాజులందరిలో గొప్పవాడు.

→ గౌతమీపుత్ర శాతకర్ణికి త్రిసముద్రాధీశ్వర’ అనే బిరుదు కలదు.

→ శాతవాహన కాలంలో ఉన్న ఓడ నాణేలు ప్రసిద్ధి చెందినవి.

→ రోమ్ దేశాలతో శాతవాహనులకు మంచి వ్యాపార సంబంధాలు కలవు.

→ ప్రముఖ బౌద్ధ వేదాంతి ఆచార్య నాగార్జునుడు. శాతవాహనుల కాలంలో నివసించాడు.

→ ఇక్ష్వాకులు ‘విజయపురి’ ప్రధాన కేంద్రంగా పరిపాలించారు.

→ ఇక్ష్వాకులు శ్రీరాముని వారసులుగా చెప్పుకుంటారు.

→ పల్లవులు క్రీ.శ. 300 నుండి 900 సం||రాల మధ్య దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు.

→ తమిళనాడులో కాంచీపురం పల్లవుల రాజధాని.

→ వీరికాలంలో వాస్తుశిల్పకళ రాతిని తొలిచి నిర్మించే ఆలయాల నుంచి రాతితో నిర్మించే ఆలయాల స్థాయికి మారినది.

→ మొదటి నరసింహవర్మ మహాబలిపురంలో అయిదు రథాలు నిర్మించాడు. ఇవి పంచ పాండవ రథాలుగా పేరొందాయి. వీటిని ఏకశిలారథాలు అంటారు.

→ కాంచీపురంలోని ప్రసిద్ధ కైలాసనాథ దేవాలయం రాజసింహుని (రెండవ నరసింహ వర్మ) వాస్తు శిల్పకళారీతికి చక్కటి ఉదాహరణ.

→ కర్ణాటకలోని బాదామిని రాజధానిగా చేసుకుని చాళుక్యులు పరిపాలించారు.

→ తొలి చాళుక్య రాజులలో రెండవ పులకేశి ప్రసిద్ధ రాజు.

→ హర్ష చక్రవర్తి రెండవ పులకేశిని ఓడించాడు. ఈ విషయాన్ని ‘ఐహోలు’ శిలాశాసనంలో పేర్కొనబడినది.

→ రెండవ పులకేశి కొలువులోని రవికీర్తి ఐహోలు శాసనాన్ని తయారు చేశాడు.

→ ‘వేశారా’ అను నూతన వాస్తు శిల్ప కళారీతి (చాళుక్యుల కాలంలో) అభివృద్ధి చెందింది.

→ దక్షిణ భారతదేశములోని ద్రవిడ’ మరియు ఉత్తర భారతదేశంలోని ‘నగారా’ వాస్తు శిల్ప కళాకృతుల మేలి కలయికే ‘వెశారా’.

→ స్వదేశీ తయారీ : స్వదేశీ వస్తువులు

→ తెగ : ఒకే జాతికి చెందిన వ్యక్తులు

→ సామ్రాజ్యం : ఒకే కుటుంబానికి చెందిన రాజుల క్రమం

→ వంశం : పెద్ద రాజ్యము

→ శిలా శాసనాలు : రాళ్ళపై చెక్కబడిన సందేశాలు

→ ఖగోళ శాస్త్రం : అంతరిక్ష అధ్యయన శాస్త్రము

→ రాజ్యం : ఒక రాజుచే పరిపాలించబడే భూభాగాన్ని రాజ్యం అంటారు.

→ సామ్రాజ్యం : సువిశాలమైన రాజ్యాలను సామ్రాజ్యాలు అంటారు.

→ మెగస్తనీసు : గ్రీకు రాయబారి, చంద్రగుప్త మౌర్యుని కొలువులో ఉండేవాడు. ఇండికా అను గ్రంథాన్ని రచించాడు.

→ కౌటిల్యుడు : ఇతనినే విష్ణుగుప్తుడు మరియు చాణుక్యుడు అని కూడా పిలుస్తారు. చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి “అర్థశాస్త్రము” అనే గ్రంథాన్ని రచించాడు.

→ కళింగ : భారతదేశ తూర్పు తీరంలోని ప్రస్తుత ఒడిషాలో ‘కళింగ’ రాజ్యం ఉంది.

→ ప్రాకృతం : అశోకుని కాలంలోని శాసనాలు ఈ భాష (లిపి) లోనే ఉన్నాయి.

→ దమ్మము : ధర్మము అనే పదాన్ని ప్రాకృత భాషలో దమ్మము అని పిలుస్తారు.

→ జాతీయ చిహ్నం : ఒక దేశం యొక్క అధికారిక చిహ్నం. ఇది దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తుంది. నాలుగు సింహాల గుర్తును భారత ప్రభుత్వం అధికార జాతీయ చిహ్నం.

→ నవరత్నాలు : రెండవ చంద్రగుప్తుని కొలువులోని తొమ్మిది మంది గొప్ప పండితులు.

→ ఆర్యభట్ట : గుప్తుల కాలంలో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త, ఇతని పేరు మీదనే 1975లో భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహంకు ఆర్యభట్ట అని పేరు పెట్టారు.

→ “త్రిసముద్రాధీశ్వర” : గౌతమీపుత్ర శాతకర్ణి బిరుదు.

→ ఆచార్య నాగార్జునుడు : ప్రముఖ బౌద్ధ వేదాంతి, శాతవాహనుల కాలం నాటి వాడు.

→ మహేంద్రుని రీతి శిల్పకళ : పల్లవ మొదటి మహేంద్రవర్మ ప్రవేశపెట్టిన నూతన ద్రవిడ వాస్తు శిల్పకళ.

→ మహామల్లుని వాస్తు శిల్పకళా రీతి : పల్లవ మొదటి నరసింహ వర్మ ప్రవేశపెట్టిన నూతన ద్రవిడ వాస్తు శిల్పకళ.

→ రాజసింహుని వాస్తు శిల్పకళారీతి : పల్లవ రెండవ నరసింహ వర్మ ప్రవేశపెట్టిన నూతన ద్రవిడ వాస్తు శిల్పకళ.

→ ద్రవిడ నిర్మా ణ శైలి : దక్షిణ భారతదేశములోని వాస్తు శిల్పకళ.

→ నగారా నిర్మాణ శైలి : ఉత్తర భారతదేశములోని వాస్తు శిల్పకళ.

→ వెశారా : చాళుక్యుల కాలంలోని ద్రవిడ, నగారా శిల్పాకృతల మెలుకలయికే ఈ వెశారా నిర్మాణ (శిల్ప) శైలి.

→ మౌర్యవంశం (322-187 B.C.E.) : చంద్రగుప్త మౌర్యుడు → బిందుసారుడు → అశోకుడు

→ శాసనాలు : రాతిపై, రాగిరేకులపై చెక్కబడిన రాజు ఆజ్ఞలు మరియు సందేశాలు.

→ ఐహోలు శాసనం : రెండవ పులకేశి విజయాలను (హర్పునిపై) తెల్పుతుంది. దీనిని రవికీర్తి వేసాడు. ఇది ప్రస్తుతం కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లాలో ఉంది.

Post a Comment

0 Comments