AP TET 2022 Class 4 EVS Best notes for Self Preparation
1. కుటుంబం
- కుటుంబాలు అన్ని ఒకే విధంగా ఉండవు. కొన్ని కుటుంబాలలో తల్లి, నాన్న , పిల్లలు మాత్రమే ఉంటారు. కొన్ని కుటుంబాలలో పిల్లలతో పాటు తాతయ్య, నాయనమ్మ కలసి జీవిస్తారు
నాన్నకి నాన్న – తాతయ్య
నాన్నకి సోదరుడు – పెదనాన్న
నాన్నకి సోదరి – అత్తయ్య
పెదనాన్న కూతురు — అక్క/ చెల్లి
అత్తకొడుకు – బావ
- త్రల్లికి చెందిన కుటుంబ సభ్యులను తల్లి తరుపు కుటుంబ సభ్యులు అంటాం
- నాన్నకి చెందిన కుటుంబ సభ్యులను నాన్న తరపు కుటుంబ సభ్యులు అంటారు
- తల్లి యొక్క అమ్మనాన్నలను అమ్మమ్మ, తాతయ్య అని పిలుస్తారు
- నాన్న యొక్క అమ్మనాన్నలను నాయనమ్మ, తాతయ్యలని పిలుస్తారు.
- తల్లికి సోదరుడు – మామయ్య
- అత్తలు, మామయ్యలు వారి పిల్లలు మన బంధువులు, వీరందరూ మన కుటుంబంలో భాగం. వీరందరినీ విస్తరించిన కుటుంబం అంటారు
- విహహం లేదా పుట్టుక వలన కుటుంబంలో మార్పులు వస్తాయి.
- వ్యాపారం, చదువు, ఉద్యోగం, కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తుల మరణం వలన కుటుంబాలలో మార్పులు వస్తాయి.
- తల్లి, నాన్న పిల్లలతో ఉన్న కుటుంబం — చిన్న కుటుంబం.
- తాతయ్య, నాయనమ్మ, పెదనాన్న, అత్త, అక్క / చెల్లి ఉన్న కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అంటారు.
- మద్యపానం ఆరోగ్యానికి హానికరం.
- ఆధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యపానాన్ని దశల వారీగా నిషేధించే చర్యలు తీసుకుంది.
- విద్యుత్ ను ఎక్కువగా ఉపయోగిస్తూ శారీరక శ్రమను తగ్గించుకుంటున్నాం.
- వంశవృక్షం వలన కుటుంబంలోని సభ్యుల మధ్య సంబంధాలు తెలుసుకోవచ్చు
2. హరిత ప్రపంచం
- నేలవాతావరణం బట్టి వివిధ ప్రదేశాలలో వివిధ మొక్కలు పెరుగుతాయి.
- నివాస స్థలాలు ఆధారంగా మొక్కలు రండు రకాలు
1. నేలపై పెరిగే మొక్కలు
2. నీటిపై పెరిగే మొక్కలు
నేలపై పెరిగే మొక్కలు : –
- మరి చెట్టు, రావి, మావిడి, చింత, బ్లాక్ బెరి వంటి వృక్షాలు మైదాన ప్రదేశాలలో పెరుగును
- పైన్, ఓక్ వంటి పొడవుగా పెరిగే వృక్షాలు పర్వత ప్రదేశాలలో పెరుగుతాయి.
- బ్రహ్మ జెముడు మొక్కలు ఎడారిలో పెరుగుతాయి.
- నాగజెముడు మొక్కలు ఎడారి ప్రాంతాలలో పెరుగుతాయి
- ఎడారి మొక్కలు వాటి దళసరి కాండాలలో నీటిని నిల్వ చేసుకుంటాయి.
- నేలపై పెరిగే మొక్కలను నేల మొక్కలు అంటారు.
- నీటి మొక్కలు :- నీటిలో పెరిగే మొక్కలను నీటిమొక్కలు అంటారు.
- నీటిపై తేలే మొక్కలకు ఉదాహరణ — డక్ విడ్, గుర్రపుడెక్క .
- చెరువు, సరస్సులు అడుగు భాగంలో వేర్లు పాతుకుని ఉండే మొక్కలు – కలువ, తామర .
- నీటిలోపల పెరిగే మొక్కలకు ఉదాహరణ — హైడిల్లా, టేప్ గాస్
- బురద లేదా చిత్తడి నెలల్లో పెరిగే మొక్కలకు ఉదాహరణ — మడ చెట్లు .
- మొక్కను రెండు వ్యవస్థలుగా విడదీయవచ్చు.
1. వేరు వ్యవస్థ
2. ప్రకాండ వ్యవస్థ.
- నేలకు పైన పెరిగే మొక్క భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అంటారు.
- నెలలోపల పెరిగే మొక్క భాగాన్ని వేరు వ్యవస్థ అంటారు.
- క్యారట్ అనునది ఆహరాన్ని నిల్వ చేసుకునే ఒక వేరు.
- బీట్ రూట్, ముల్లంగి అనునది నెలలోపల పెరిగే వేర్లు.
- మొక్కను నేలలో గట్టిగా పట్టి ఉంచి నేలనుండి పోషకాలను గ్రహించేవి — వేర్లు.
- మొక్కలలో వేర్లు రెండు రకాలు.
- త్రల్లివేరు ఒక బలమైన ప్రధానవేరును కలిగి ఉంటుంది.
- త్రల్లి వేరు నేలలోకి లోతుగా చొచ్చుకుపోతుంది.
- త్రల్లి వేరుకు అన్నివైపులా సన్నని వేర్లు పెరుగుతాయి.
- Ex: వేప, చింత
- గ్రుబురు వేర్లు లేదా పీచు వేర్లు గుబురుగా పెరుగుతాయి .
- కాండం అడుగుభాగం నుండి అనేక సన్నని చిన్న వేర్లు గుంపు గా పెరుగుతాయి.
- Ex: – వరి, జొన్న, మొక్క జొన్న .
- మర్రి, వేప, చింత వంటి వృక్షాలలో వేర్లు నేలలోనికి చొచ్చుకుని పోయి ఉంటాయి .
- గులాబీ, మల్లె వంటి మొక్కలలో వేర్లు లోతులోనికి పెరగవు.
- నీటి మొక్కల వేర్లు మృదువుగా, స్పాంజిలాగా ఉండి తేలడానికి సహకరిస్తాయి.
- వేర్లు సాధారణంగా ఏ రంగులో ఉంటాయి — బూడిద.
- ఆహారంగా తీసుకునే వేర్లకు ఉదాహరణ — క్యారెట్, బీట్ రూట్, ముల్లంగి
- వేసవిలో చల్లదనం కోసం ఉపయోగించే కూల్ మ్యాట్ లో ఉపయోగించే వేరు – వట్టివేర్లు.
- దుస్తులు ఉంచే అలమరలో మంచి వాసన కోసం ఉపయోగించే వేర్లు – వట్టివేర్లు
- సువాసన తైలాలలోనూ, దోమలను తరిమే పదార్భాలలోనూ ఉపయోగించే వేర్లు – నిమ్మగడ్డివేర్లు
- పువ్వులో భాగాలు 1. ఆకర్షక పత్రం 2.రక్షక పత్రం 3. కేసరం 4. కాడ 5. అండ కోశం
- పువ్వు యొక్క రంగురంగుల భాగాన్ని పమంటారు — ఆకర్షక పత్రం.
- మందార, వేప, తులసి మొక్కల పుష్పాలు జౌెషధాల తయారీలో ఉపయోగిస్తారు
- గులాబీ, మల్లె, లిల్లీ, లావెండర్ పుష్పాలను సెంట్లు, సౌందర్య తైలాల తయారీలో వాడతారు.
- ఆహారంగా తీసుకునే పువ్వుకు ఉదాహరణ — కాలీఫ్లవర్ .
- రైతులు విత్తనాలు లేని పండ్లను సంకరీ కరణ పద్దతి సాంకేతికత ద్వారా పండిస్తున్నారు.
- ఫలాలలో విటమిన్లు , ఖనిజలవణాలు మనకు అందించే అద్భుత వనరులు.
- ప్రత్యేకంగా పండుగనాడు మాత్రమే తయారీ చేయు పదార్థం – ఉగాది పచ్చడి.
- AP, తమిళనాడు, కర్నాటకలో ఉగాది పండుగ యొక్క ప్రత్యేక వంటకం — ఉగాది పచ్చడి .
- ఉగాది పచ్చడిలో రుచుల సంఖ్య — 6
అవి — తీపి, పులుపు, ఉప్పు, వగరు, కారం, చేదు.
- షడ్రచులు జీవితంలో మనకు 6 భావోద్వేగాలను సూచిస్తాయి.
- భ్రౌషద విలువలు కలిగి ఉన్న ఫలాలు — నిమ్మ, ఉసిరి.
- వెంట్రుకలు శుభ్రపరచుకోవడానికి ఉపయోగించే ఫలాలు — కుంకుడు కాయ, సీకాయ .
- మొక్కలు CO2, నీరు, సూర్యరశ్మిని ఉపయోగించుకుని స్వయంగా ఆహారం తయారు చేసుకునే ప్రకియను కిరణజన్య సంయోగ క్రియ అంటారు.
3. మన చుట్టూ ఉండే జంతువులు
- పక్షి తలకు ఇరువైపులా రంధ్రాలు ఉంటాయి .
- ఆ రంధ్రాలు ఈకలతో కప్పివేయబడి ఉంటాయి
- ఈ రంధ్రాలు పక్షులకు వినికిడి కలిగిస్తాయి
- జీబ్రా శరీరంపై తెలుపు, నలుపు చారలు చాలా అందంగా ఉన్నాయి
- చిరుత శరీరంపై నల్లని మచ్చలు ఉన్నాయి
- గొర్రె చర్మంపై ఉన్న దట్టమైన వెంట్రకలను స్వెట్టర్ లు, కోట్ ల తయారీలో ఉపయోగిస్తారు
- జంతువుల చెవులు బయటకు కనిపించి, చర్మం పై వెంటుకలు ఉండే జంతువులు పిల్లలకు జన్మనిస్తాయి. వాటిని శిశోత్సాదకాలనని అంటారు
- శిశోత్వాదకాలనే క్షీరదాలు లేదా పాలిచ్చే జంతువులు అంటారు
- జంతువు చెవులు బయటకు కనిపించకుండా చర్మంపై వెంట్రుకలు ఉండని జంతువులు గుడ్డు పెట్టి వాటిని పొదిగి పిల్లలకు జన్మనిస్తాయి ఇలాంటి జంతువులను ఆండోత్వ్సాదకాలు అంటారు.
- డాల్ఫిన్ లు పిల్లలను కని పాలిచ్చి పెంచుతాయి
- జంతువుల నోరు. చలనాంగాలు అవి తీసుకునే ఆహరాన్ని బట్టి నిర్మించబడ్డాయి .
- మొక్కలు, మొక్కల నుండి లబించే పదార్ధాలను మాత్రమే ఆహరంగా తీసుకునే జీవులు – శాకాహరులు
- శాకాహరులకు పదునైన కోరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు ఉంటాయి
- శాకాహరులకు ఉదాహరణ :. గేదె, మేక, జింక, గుర్రం
- గొంగళిపురుగులకు ఆకులను తినే లక్షణం ఉండని తెలుసుకదా. గొంగళి పురుగు శాకాహరి
- ఇతర జంతువుల మాంసాన్ని ఆహరంగా తీసుకునే జంతువులు – మాంసాహరులు
- మాంసాహర జంతువులుకు పొడవైన, బలమైన చీల్చే దంతాలు ఉంటాయి
- Ex:- పిల్లి, కుక్క, సింహం
- మాంసాహర పక్షులు పదువైన ముక్కుతో మాంసాన్ని చీల్చుకుని తింటాయి.
- Ex:- గద్ద, రాబందు
- పులి దేనికి ఉదాహరణ -మాంసారహరులు
- ఎలుగుబంటి మొక్కలను, జంతువులను రెండిటినీ తింటుంది .
- ఎలుగుబంటి దేనికి ఉదాహరణ – ఉభయహరి .
- ఉభయాహర జీవులు మొక్కలు, జంతువులు రెండింటినీ ఆహరంగా తీసుకుంటాయి .
- మాంసాహరులకు పదునైన కోరికే దంతాలు, బలమైన నమిలే దంతాలుతోపాటు చీల్లే దంతాలు కూడా ఉంటాయి.
- మానవుల ఆహారపు అలవాట్ల వలన వారిని ఉభయాహరులు అంటారు.
- కాకి ఉభయాహరి.
- పక్షులు ముక్కల ఆకారాలు వాటి ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటాయి.
- ముక్కులు పక్షుల యొక్క దవడలు .
- ఆహరాన్ని పట్టు కోవడానికి, తమను తాము రక్షించుకోవడం కోసం పక్షులు కాలిగోళ్లను ఉపయోగిస్తాయి .
- పక్షుల పాదం, కాలిగోళ్ల ఆకారం అవి తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటాయి .
- పక్షుల కాలిగోళ్ళు పొడవుగా వంపు తిరిగి ఉంటాయి
- పక్షులు గుద్దు పెట్టి సమయానికి ముందుగా గూళ్ళు కట్టుకొంటాయి .
- సాధారణంగా మగ పక్షులు గూళ్ళు కడతాయి .
- కాకి తన గూడును చిన్న కొమ్మలు, ఎండుటాకులతో నిర్మిస్తుంది .
- గిజిగాడు తన గూడును ఆకులు, గడ్డి కొమ్మలు, వైర్లతో అల్లుకుంటుంది .
- చెట్టు ఆకులను కలిపి , గుడ్డుగా మలిచే పక్షి – టైలర్ బర్డ్
- గద్ద తన గూడును పొడవైన పుల్లలు, గడ్డి, చెట్టు కొమ్మలతో రాతి శిఖరాలపైనా లేదా ఎత్తెన చెట్టుపైన పెడుతుంది .
- కుందేలు బొరియలో ఉంటుంది .
- పులులు, సింహాలు గుహలలో ఉంటాయి
- సాలెపురుగు తన గూడు తానే అల్లుకుంటుంది
- వలస వెళ్ళే పక్షులు తమ ప్రయాణంలో శక్తిని కోల్పోయే అవకాశం ఉంది. దీనిని నివారించుకోవడానికి పక్షులు v ఆకారంలో ప్రయాణిస్తాయి.
- చీమలు సముహంగా జీవిస్తాయి.
- చీమల కాలనీలో రాణి చీమలు, మగ చీమలు, శ్రామిక చీమలు ఉంటాయి .
- చీమలలో క్రమశిక్షణ, పనివిభజన ఉంటుంది .
- చీమలు విడుదల చేసే రసాయనం సహాయంతో ఒక దారిని ఏర్పరిచి ఆహారానికి సంబంధించిన సమాచారాన్ని ఇతర చీమలకు అందిస్తాయి
- తేనెటిగలన్ని కలిసి తుట్టిని నిర్మించుకుని జీవిస్తాయి .
- తేనెటిగలన్ని కలిసి ఆహరాన్ని పంచుకుంటూ తమ లార్వాలకు ఆహారాన్ని అందిస్తాయి .
- సమూహంగా కలిసి పనిచేయకపోతే తేనెటీగలు అంతటి అందమైన ఇల్లు నిర్మించుకోలేవు.
- 10 నుండి 12 ఏనుగులు వాటి పిల్లలతో పాటు సమూహంగా వెళుతుంటాయి .
- వయసులో పెద్ద ఏనుగు గుంపుకు నాయకత్వం వహిస్తుంది.
- గుంపులుగా జీవించే ప్రవర్తన ఏనుగులకు రక్షణ ఇస్తుంది.
4. జ్ఞానేంద్రియాలు
- మానవ శరీరం మూడు భాగాలుగా విభజించబడింది.
- 1.తల 2. మొండెం 3. చేతులు, కాళ్ళు
- శబ్దజ్ఞానం ఇచ్చే అవయువం — చెవి
- దృష్టి జ్ఞానం ఇచ్చే అవయువం — కన్ను
- రుచి జ్ఞానం ఇచ్చే అవయువం — నాలుక
- స్పర్శ జ్ఞానం ఇచ్చే అవయువం — చర్మం
- వాసన జ్ఞానం ఇచ్చే అవయువం — ముక్కు
- జ్ఞానేంద్రియాలు మొత్తం – 5
- జ్ఞానేంద్రియాలు వివిధ అంశాలకు అనుగుణంగా ప్రతిస్పందించుటకు సహాయపడతాయి .
- కళ్ళు చూడడానికి సహాయ పడతాయి
- కనురెప్పలు, కంటి పక్షాలు కంటిని సంరక్షిస్తాయి.
- చదివే సమయంలో కంటికి, పుస్తకానికి మధ్య 3౦ సెంటి మీటర్ల దూరం ఉండాలి .
- టెలివిజన్ ను కనీసం 6 అడుగుల దూరం నుండి చూడాలి.
- అంధులు అనగా కంటి చూపు లేనివారు.
- అంధులు ఉపయోగించే లిపి – బెయిలి లీపి.
- అంధుల కోసం ప్రత్యేక లిపి రూపొందించింది – లూయిస్ బెయిలీ
- బెయిలీ లిపిలి లో స్పర్శ ద్వారా చదవగలుగుతాము .
- ఈగలు కలిగి ఉండే కాళ్ళ సంఖ్య – 5
- గద్ద, రాబందు, డేగ వంటి పక్షులు మంచి కను దృష్టిని కలిగి ఉంటాయి.
- గుడ్లగూబ చీకటిలో కూడా చూడగలుగుతుంది .
- ముక్కు సహాయంతో శ్వాస తీసుకుంటాం, వాసనలు తెలుసుకుంటాం .
- ముక్కు లోపలి సన్నని వెంట్రుకలు గాలిలోని దుమ్మును వడగట్టి శుభ్రమైన గాలిని లోనికి పంపుతాయి
- ఘ్రాణ శక్తి అనగా వాసన శక్తి
- పిల్లులు, కుక్కలకు బాగా సుశిశితమైన ఘ్రాణ శక్తి కలదు.
- డాగ్ స్క్వాడ్ గా ఉపయోగించేది – స్నిఫర్ డాగ్.
- నేరస్తులను గుర్తించడం కోసం దాచి ఉంచిన బాంబులు, ఆయుధాలు కనుగొనడం కోసం ఉపయోగించేవి – స్నిఫర్ డాగ్
- ఏనుగులు 3 కిలోమీటర్ల దూరం నుండే నీటి జాడను గుర్తించగలవు.
- చెవులతో శబ్బాలను వింటాం .
- నిశాచర జీవులకు ఉదాహరణ — గుడ్ల గూబ, గబ్బిలాలు
- నిశాచర జీవులు అనగా రాతిరి పూట సంచరించేవి.
- వినికిడి శక్తి చాలా ఎక్కువ గల నిశాచర జీవులకు ఉదాహరణ — గుడ్ల గూబలు, గబ్బిలాలు
- పిల్లులు చిన్న శబ్బాలను కూడా వినగలవు .
- నాలుకపై ఉండే రుచి మొగ్గలు మనకు వివిధ రకాల ఆహారపదార్థాల రుచిని తెలుసుకొనుటకు సహాయపడతాయి .
- నాలుక సహాయంతో మనం మాట్లాడగలం
- వినలేని, మాటలాడ లేని వారు సంకేతాలతో తమ భావాలు ఇతరులతో పంచుకుంటారు.
- ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుకను ఉపయోగించే జంతువులు — కప్పలు, బల్లులు, ఊసరవెల్లులు
- జిరాఫీలో పొడవైన నాలుక ఉంటుంది .
- పాములు నాలుక ద్వారా వాసనను పసిగడతాయి.
- జ్ఞానేంద్రయాలు అన్నింటిలో సున్నితమైనది – చర్మం .
- చర్మం స్పర్శకు ప్రతిస్వందిస్తుంది .
- పాము తన చర్మంతో దూరంగా ఉన్న శత్రువులను పసిగట్టగలదు .
- వ్యక్తి గత పరిశుభ్రత అనగా శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం .
- PWD చట్టం చేయబడిన సంవత్సరం — 2016
- PWD చట్టం ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాటలాడలేని వారిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అంటారు .
- దివ్యాంగులుకు ఉదాహరణ — సుధా చంద్రన్, రవీంద్ర జైన్.
- సుధా చంద్రన్ ఒక నర్తకి. ప్రమాదంలో కాలు కోల్పోయింది.
- కృత్రిమ కాలు సాయంతో నాట్యం చేయడం మొదలు పెట్టి విజయం సాధించారు .
- రవీంద్ర జైన్ పుట్టుకతో అంధత్యం కలిగి ఉన్నారు .
- కంటి చూపు లేనప్పటికీ ఆయనలోని ప్రతిభ, కఠోరశ్రమ ఆయనను సినిమా ప్రపంచంలో గాయకునిగా గొప్ప స్థానంలో నిలబెట్టాయి .
- భద్రతా భావాన్ని కలిగించే శారీరక స్పర్శను మంచి స్పర్శ అంటారు.
- అభద్రతా భావం కలిగించే స్పర్శను చెడు స్పర్శ అంటారు.
- మన శరీరంలో ఎవరూ చూడకూడని, తాకకూడని కొన్ని భాగాలను రహస్య భాగాలు అంటారు. క6- ఛాతీ, కాళ్ళ మధ్య భాగం, వెనుకభాగం
5. మనం తినే ఆహారం
- ఆహారం తీసుకోవడం సంతోషదాయకం. అది మనకు పని చేయడానికి శక్తిని ఇస్తుంది.
- మధ్యాహ్న బోజన పధకంలో ప్రస్తుతం విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహార వివరాలు .
1. సోమవారం –అన్నం ,పప్పు చారు ,కోడి గుడ్డు కూర ,చిక్కి
2. మంగళ వారం — పులిహార ,టమాటా పప్పు ,ఉడకబెట్టిన గుడ్డు
3. బుధవారం — వెజిటబుల్ రైస్ ,ఆలూ కుర్మా, ఉడకబెట్టిన గుడ్డు ,చిక్కి
4. గురువారం — కిచిడీ ( పెసరపప్పు అన్నం ), టమాటా చట్నీ , ఉడకబెట్టిన గుడ్డు
5. శుక్ర వారం – అన్నం ,ఆకు కూర పప్పు , ఉడకబెట్టిన గుడ్డు ,చిక్కి
6. శనివారం – అన్నం ,సాంబార్ ,స్వీట్ పొంగల్
- మోదుగ, బాదం, మరిచెట్టు ఆకులతో విస్తరాకులు చేస్తారు.
- ప్లాస్టిక్ ప్లేట్లు కవర్ల, సీసాలు ఆహారం నిలువచేయడానికి ఉపయోగిస్తే అందులోని ప్లాస్టిక్ కరిగి ఆహార పదార్థాల ద్వారా మన శరీరంలో ప్రవేశించి మనకు వ్యాధులను కలిగిస్తుంది .
- పచ్చళ్ళకు బూజు పట్టకుండా బాక్టీరియాను నిరోధించడానికి ఉప్పు, నిలువచేసే కారకంగా నూనెలు వాడతారు
- తాజా పండ్ల ను చక్కెర పాకంలో నిలువ ఉంచవచ్చు.
- కూరగాయలు, మాంసం , చేపలను అధిక చల్లదనం గల పెట్టెలో నిలువ ఉంచడాన్ని ఫ్రీజింగ్ అంటారు .
- కందిపొడి తయారీకి కావలసిన పద్దార్ధాలు — కండిపప్పు, ఉప్పు, జీలకర్ర, ఎండుమిర్చి.
- వరి, గోధుమ, పప్పుధాన్యాలు కీటకాలు, బూజుల చేత పాడు చేయబడకుండా ఉండడం కోసం వేప ఆకులను ఎండ బెట్టి నిల్వ ఉంచే సంచులలో వేస్తారు.
- టిన్, స్టీల్, అల్యూమినియం డబ్బాలలో నిల్వ ఉంచడం ద్వారా ధాన్యాలను మనం సంరక్షించగలం .
- కొడవలి తయారు చేసేవాడు – కంసాలి
- నాగలి తయారు చేసే వాడు – వడ్రంగి
6. నీరు
- గ్రామాలలోని చెరువులు నీటి వనరులుగా వ్యవసాయానికి తాగడానికి, ఇతర అవసరాలకు ఉపయోగపడతాయి.
- యతలవంక చెరువు చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో నీటి గుంటపల్లి వద్ద కలదు.
- కొన్ని చెరువులు కాలువలతో అనుసంధానం చేయబడి ఉంటాయి.
- బుక్కపట్నం, ధర్మవరం చెరువులు అనంతపురం జిల్లాలో ఉన్నాయి.
- వర్షాకాలంలో నీరు ఒక చెరువు నుండి మరొక చెరువుకు ప్రవహించే వాటికి ఉదాహరణ — బుక్కపట్నం, ధర్మవరం చెరువులు.
- నదుల నీటితో చెరువులు నింపడానికి కూడా కాలువలు తవ్వుతారు. ఇటువంటి చెరువులు కృష్ణా , ఉభయగోదావరి జిల్లాలో ఉన్నాయి.
- చెరువులు నిర్మాణం వలన భూగర్ధ నీటి మట్టం పెరుగును.
- చెరువులోని నీటిని అలాగే తాగితే టైఫాయిడ్ , కలరా, నీళ్ళ విరేచనాలు వంటి వ్యాధులు వస్తాయి .
- గ్రామీణ ప్రాంత ప్రజలుకు తాగునీటిని, అందించే బాధ్యత తీసుకునేది – గ్రామ పంచాయతి
- చెరువులోని నీటి శుద్ది చేయడంలో కొన్ని దశలుంటాయి
- చెరువు నుండి నీరు తెర్పే తోట్టెలలో నింపుతారు. నీటిలోని ఇసుక రేణువులు కిందకు చేరుతాయి.
- తరువాత నీటిని వడపోత తోట్టెలోనికి పంపిస్తారు.
- వడపోయబడిన నీరు క్లోరినేషన్ తోట్టెలోకి పంపుతారు .
- క్లోరినేషన్ చేయబడిన నీరు పెద్దగా ఉండే ఓవర్ హెడ్ టాంక్ లోనికి పంపిస్తారు.
- ఓవర్ హెడ్ టాంక్ ల నుండి ఇళ్లకు సరఫరా చేస్తారు.
- క్లోరినేషన్ తోట్టెలో నీటిలోని సూక్ష్మ జీవులను చంపడానికి నీటికి బ్లిచింగ్ పౌడర్ కలుపుతారు.
- ప్రభుత్వం రైతులతో నీటి వినియోగ దారుల సంఘాల ఏర్పాటు చేసి వారికి చెరువుల నిర్వహణ బాధ్యత ఇచ్చింది .
- ఈ సంఘాలవారు కాలువలు, చెరువుల నుండి మొక్కలు, పూడికలు తీయించి పరిశుభ్రంగా ఉంచుతారు. చెరువులోని మట్టి నిక్షేపాలను పొలంలో వేస్తారు. దీనితో చెరువులలో నీటి మట్టం పెరుగుతుంది
- నీరు, ఆవిరిగా మారే ప్రకీయను భాష్పీభవనం అంటారు .
- సూర్యరశ్మి వలన నీరు, గాలిలోనికి ఆవిరి రూపంలో భాష్పీభవనం చెందును.
- ఇదిఘనీభవనం చెంది మేఘాలుగా ఏర్పడతాయి
- మేఘాలు చల్లగాలి వలన చల్లబడి చిన్న బిందువులుగా మారతాయి. దీనినే ఘనీభవనం అంటారు
- నీటి చుక్కలు మేఘం నుండి కిందకు రావడాన్ని వర్షం అంటారు
- నీరు భూమి ఉపరితలం నుండి భాష్పీభవనం చెంది మేఘాలుగా ఏర్పడి, ఆ తరువాత మేఘాలు చల్లబడి భూమిపైకి ఆవిరి వర్షం రూపంలో తిరిగి చేరుతుంది . ఈ నిరంతర ప్రకియనే జలచక్రం అంటారు..
7. వారి సేవలు విలువైనవి
- రంగుల వేసేవారిని పెయింటర్ అంటారు .
- రంగులు వేయడానికి ఉపయోగించిన పనిముట్లు – బ్రష్
- ఒక పనిని సులభంగా చేయడానికి ఉపయోగించే వస్తువును పనిముట్లు అంటారు.
- పెయింటర్స్ వాడే బ్రష్ – పెయింటింగ్ బ్రష్.
- క్షురకుడు(షేవింగ్) వాడే బ్రష్ – షేవింగ్ బ్రష్
- చెప్పులు కుట్టేవాడు వాడే బ్రష్ – షూ పాలిస్ బ్రష్
- నైపుణ్యం కలిగి ఉన్న పనుల ద్వారా సంపాదించడాన్ని వృత్తి అంటారు.
- రైతులు పారతో నేలను చదును చేయడంతో పాటు, నీరు పారడానికి కావలసిన బోదేలను ఏర్పాటు చేస్తారు.
- రైతులు కొడవలితో కోతలు కోస్తారు.
- నాగలితో భూమిని దున్నుతారు .
- దుస్తుల రూపకర్తను ఏమంటారు – దర్జీ(టైలర్).
- ఇంటి నిర్మాణం చెయ్యడానికి మనకు సహాయం చేసే వ్యక్తిని తాపీ మేస్త్రీ అంటారు .
- కుండలు తయారు చేయువారు – కమ్మరి.
- బెజవాడ విల్సన్ – సామాజిక ఉద్యమకారుడు
- పొడి మరుగు దొడ్లలోని మానవ విసర్జితాలను శుభ్రంచేసే పారిశుద్ద్య కార్మికులకు వృత్తి నుండి విముక్తి కలిగించి పునరావాసం కలిగించడానికి కృషి చేసింది – బెజవాడ విల్సన్
- మరుగుదొడ్డి శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్షికుడి కుమారుడు అదే వృత్తి చేపట్టవలసిన అవసరం లేదు. వారికి స్వేచ్చను సమాన అవకాశాలు ఇవ్వనట్లయితే సామాజిక విభజన పోత్సహించిన వారము అవుతాము అన్నది – బెజవాడ విల్సన్.
- పరిశుభ్రత దైవకార్యం లాంటిది అన్నది – మహాత్మాగాంధి.
- బట్టలు ఉతికి ఇస్త్రీ చేసేది – చాకలి/ రజికుడు .
- బంగారు ఆభరణాలు తయారు చేసేది – కంసాలి .
- చెప్పులు కుట్టి, సరిచేసేవాడు — చర్మకారుడు .
- విధ్యుత్ పరికరాలను మరమత్తు చేసేది – ఎలక్ట్రీషియన్
- నీటి పైపుల, పంపుల నిర్వహణ చేసేది – పంబర్
- సామానులు మోయడానికి సహాయపడేది – కూలి (పోర్టర్)
- చేపలను పట్టి అమ్మేది – జాలరి
- పరిసరాలను శుభ్రంగా ఉంచేది – పారిశుద్ద్య కార్మికులు
- రైతులకు తగ్గింపు ధరలలో విత్తనాలు, పనిముట్లు అందించేది – వ్యవసాయ అధికారి
- రైతులకు విద్యుత్ సరఫరా చేసి సహకరించేది – విద్యుత్ ఇంజనీరు.
- రైతులకు భూమిహక్కు పాస్ పుస్తకాలు అందించేది – తహసిల్డారు .
- జగదీష్ చంద్రబోస్ 1858 నవంబర్ 30న జన్మించారు
- మొక్కల పెరుగుదలను గురించే పరికరం అయిన kreskograph(క్రెస్కోగ్రాఫ్) ని కనుగొన్న శాస్త్ర వేత్త – జగదీష్ చంద్రబోస్ .
8. రవాణా
- మనుషులు, వస్తువులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి భూ, జల, వాయు మార్గాలలో జరిపే కదలికలను రవాణా అంటారు.
- రవాణా వాహనాలకు ఉదాహరణ — సైకిల్, బస్, కారు, రైలు .
- మైదాన ప్రాంత రవాణాకు , కొండ ప్రాంత రవాణాకు వ్యత్యాసం ఉంది.
- రవాణా వ్యవస్థ అనునది ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది .
- మైదాన ప్రాంతాలలో సైకిల్, బైక్, కారు, లారీ, ట్రాక్టర్ , ఎద్దులబండి, జట్కా(టాంగా) లాంటివి రవాణాకు ఉపయోగిస్తారు .
- కొండప్రాంతాలలో ప్రజలు కాలిబాటలలో ప్రయాణిస్తారు .
- కొండ ప్రాంతాలలో గాడిదలు, గుర్రములు వస్తువుల రవాణాకు ఉపయోగిస్తారు .
- విశాఖ పట్టణం జిల్లాలోని అరుకు లోయ కొండ ప్రాంత రవాణాకు ఒక ఉదాహరణ .
- ఈ రోజులలో కొన్ని కొండ ప్రంతాలలో రోప్ వే లను ఏర్పాటు చేసుకుని ఏరియల్ కార్లు రవాణాకు ఉపయోగిస్తున్నారు .
- అడవులలో శాస్వత రోడ్డు మార్గాలు ఉండవు .
- అడవులలో వృద్దులను, రోగులను డోలీలలో మోసుకుని వెళతారు .
- ఎడారి ప్రాంతాలలో రవాణా సౌకర్యం చాలా పరిమితంగా ఉంటుంది.
- ఎడారిలో ప్రధాన రవాణా సౌకర్యం – ఒంటె.
- ఒంటె సునాయాసంగా ఎడారిలో ఎక్కువ దూరం నీరు తాగకుండా ప్రయాణిస్తుంది .
- ఒంటెను ఎడారి పీడ అంటారు.
- ఒంటె మూపురం వేడిగా ఉన్న ఎడారి ప్రాంతాలలో వారాల పాటు నీరు తాగకుండా జీవించడానికి సహాయపడుతుంది.
- ధృవ ప్రాంతాలు వఎల్లప్పుడు మంచుతో కప్పబడి ఉంటాయి .
- ధృవ ప్రంతాలలో కుక్కలు లాగే స్తేడ్డ్ బండ్లను రవాణా కొరకు వినియోగిస్తారు .
- భారత దేశంలో మంచుతో కప్పబడి ఉన్న పర్వతాలు – హిమాలయ పర్వతాలు .
- హిమాలయ పర్వతాలలోని ప్రజలు జడలబరె, డొలీలు లేక స్లేడ్డ్ లను ప్రయాణం కోసం వినియోగిస్తారు.
- దాల్ సరస్సు ఎచట కలదు – జమ్మూకాశ్మీర్
- దాల్ సరస్సు పై పడవ రవాణా సాధనంగా ఉపయోగిస్తారు .
- మన రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదుల మధ్య అనేక లంక గ్రామాలు (ఐలాండ్) లో పట్టీలు ,
- పడవలు రవాణా కోసం వినియోగిస్తారు .
- అత్యంత వేగంగా ప్రయాణించే రైలు – బూల్లెట్ రైలు .
- నీటిపైన వేగంగా ప్రయాణించే కార్ – వాటర్ కార్
- గాలిలో ఎగిరేవి – డ్రోన్ లు (dron)
9. సమాచార ప్రసారం
- భావాలను అనుభూతులను వ్యక్తంచేయు ప్రకియలను భావప్రసారం అంటారు.
- భావప్రసారం 2 రకాలు 1. వ్యక్తిగత భావప్రసారం 2. బహుళ సమాచార ప్రసారం
- ఇది వార్తలను, సందేశాలను పంపించడం లేదా తీసుకోవడం ద్వారా జరుగుతుంది
- వ్యక్తిగత భావ ప్రసారం కోసం మనం పోస్టల్ సేవలు ఉపయోగిస్తాం.
- Ex: పోస్ట్ కార్డులు, ఇన్లాండ్ లెటర్, పోస్టల్ కవర్ .
- పోస్టల్ కవర్ ను ఎన్వలప్ కవర్ అంటారు .
- దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పోస్టాఫీసుకు ఒక సంఖ్య ఇవ్వబడుతుంది. దీనిని పిన్ కోడ్ అంటారు .
- పిన్ కోడ్ ను అడ్రస్ తో పాటు రాయాలి
- చిరునామా కలిగి ఉన్న ప్రదేశమును సులభంగా గుర్తించుటకు సహయం చేసేది – పిన్ కోడ్.
- PIN = Postal Index Number
- ప్రస్తుత కాలంలో సత్వర సమాచారం కోసం మొబైల్ ఫోన్లు, Emails ఉపయోగిస్తున్నారు
- ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్ కు పంపే సంక్షిప్త సమాచారాలను Email అంటారు .
- సూచనలు చేయడానికి, డాక్యుమెంట్లను, లెటర్లు, ఫైళ్ళు, ఫోటోలు, వీడియోలు పంపుటకు Email వాడతారు .
- బహుళ సమాచార ప్రసారం ఒకే సమయంలో పెద్ద సంఖ్యలో జనాభాకు సమాచారం అందించే మాధ్యమం .
- వార్తలు, వివిధ వ్యాసాలు, ప్రకటనలు, ప్రపంచ వార్తలను సమాచారాన్ని ప్రింట్(print) రూపంలో అందించేది – వార్తా పత్రిక.
- రేడియో వినికిడికి సంబంధించిన పరికరం .
- TV వినికిడి మరియు దృష్టికి సంబంధించిన పరికరం.
- రేడియో కనుగొన్నది – మూర్కొని .
- TV కనుగొన్నది – JL బయర్డ్.
10. చూసివద్దాం
- జాతీయ పండుగలు – గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం
- స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే రోజు – ఆగష్టు 15
- గణతంత్ర దినోత్సవం జరుపుకునే రోజు – జనవరి 26
- వ్యవసాయానికి సంబంధించిన పండుగ – ఏరువాక
- మతపరమైన పండుగలు — దీపావళి, christmas, రంజాన్
- శ్రీరామ నవమి పండుగను హిందువులు మారి లేదా లేదా 20 నెలలో జరుపుకుంటారు .
- శ్రీరామ నవమి శ్రీరాముని పుట్టిన రోజు.
- శ్రీరామనవమి రోజున బెల్లంతో చేసిన పానకం అనే ద్రవాన్ని తీసుకుంటారు.
- కైస్తవులు christmas పండుగను డిసెంబర్ 25 న జరుపుకుంటారు.
- christmas ఏసుకిస్తు పుట్టినరోజు.
- కిస్ మస్ పండుగ రోజు శాంతా క్లాజ్ పిల్లలకు ఇష్టమైన బహుమతులు ,స్వీట్లు ఇస్తారు.
- ముస్లిం ల ప్రధాన పండుగ ఈద్ – ఉల్ – ఫీతర్.
- ఈ రోజు మసీదులో అల్లాను ప్రార్ధిస్తారు .
- పేదవారికి బహుమతులు, కానుకలు అందచేస్తారు .
- ఈద్ మూబారక్ అంటూ శుభాకాంక్షలు ఒకరికి ఒకరు తెలుపుకుంటారు .
- సిక్కుల ప్రధాన పండుగ — గురునానక్ జయంతి .
- గురునానక్ జయంతిరోజున గురుద్వారాకు వెళ్ళి ౧౧౫/6 చేస్తారు .
- గురునానక్ జయంతిని గురుపరబ్ గా పిలుచుకుంటారు.
- బౌద్దులు జరుపుకునే ముఖ్యమైన పండుగ — బుద్ధపూర్ణిమ
- బుద్దపూర్ణిమ అనునది గౌతమబుద్దుని జయంతి.
- మోదకొండమ్మ జాతర పాడేరు వద్ద గల మోదుగల గ్రామంలో జరుపుతారు.
- ఉత్తరాంధ్రలోని గిరిజనులు మోదుకొండమ్మ జాతర జరుపుతారు.
- ఈ జాతర 3 రోజుల పాటు జరుగుతుంది
- గ్రామదేవత ప్రతిరోజూ రాతిరి వేళ ఊరిలో బండను సందర్శిస్తుంది . ఆ రాయిని పవిత్రమైనదిగా భావిస్తారు కాబట్టి ఆ ఊరిని బండపల్లి అని పిలుస్తారు .
- లేపాక్షి ఏ జిల్లాలో గలదు – అనంతపురం
- లేపాక్షి లో వీరభథ్రుని గుడి ఉన్నది .
- 1530 వ సంరంలో విజయనగర రాజ్య గవర్నర్లైన విరూపానంద మరియు వీరన్నలు ఈ గుడి కట్టారు .
- లేపాక్షిలో నంది విగ్రహం కలదు.
- లేపాక్షిలో గల నందిని లేపాక్షి బసవన్న అంటారు
- సిద్దవటం కోట ఏ జిల్లాలో గలదు – ysr కడప
- సిద్ధవటం కోట ఏ నది ఒడ్డున కలదు – పెన్నా.
- సిద్దవటం కోటను 1303వ సంవత్సరంలో 30 ఎకరాల భూమిలో కట్టారు .
- సిద్దవటం కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా అక్కడి ప్రజలు భావిస్తారు
- సిద్దవటం కోటకు గల రెండు ప్రధాన ద్వారాలు నిర్మాణపరంగా శోభాయమానంగా ఉన్నాయి
- చంద్ర గిరి కోట ఏజిల్లాలో గలదు — చిత్తూరు .
- చంద్ర గిరి కోట 11వ శతాబ్దంలో కట్టబడింది
- చంద్రగిరి కోట యాదవ నాయకుల చేత విజయనగర రాజ్య పాలకుల ఆభీనంలో కట్టబడింది .
- చంద్రగిరి కోటలో గల మహల్ లు – రాజమహల్ , రాణీ మహల్
- ఈ మహల్ లు 300 సంవత్సరాల నుండి అలాగే ఉన్నాయి.
- రోళ్ళపాడు శాంక్తుయరి ఎ జిల్లాలో కలదు — కర్నూలు .
- రోళ్ళపాడు అనునది పక్షుల సంరక్షణా కేంద్రం.
- రోళ్ళపాడు ఏ పక్షికి ఆవాసం — బట్టమేక .
- ISRO అనగా – ఇండియన్ స్పేస్ రీసెర్ట్ ఆర్గనైజేషన్
- ISRO కు ఏ శాస్త్ర వేత్త పేరు పెట్టారు – సతీష్ ధావన్
- ISRO రాకెట్ ప్రయోగ కేంద్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గలదు .
- ISRO రాకెట్ ప్రయోగ కేంద్రం పులికాట్ సరస్సు దగ్గరలో సూళ్ళూరు పేటలో నిర్మించబడింది .
- కృతిమ ఉపగ్రహలను ఈ రాకెట్ ప్రయోగ కేంద్రం ద్వారా అంతరిక్షంలోనికి పంపుతున్నారు.
- ప్లేమింగో బర్డ్ శాంకువరీ ఎచట గలదు — నేలపట్టు .
- నేలపట్టు అనునది పులికాట్ సరస్సులో గలదు .
- నేలపట్టులో ప్రతి సంవత్సరం ఫ్లెమింగో పెస్టివల్ నిర్వహిస్తారు .
- కాకతీయుల కాలంలో ప్రసిద్ద నౌకాశ్రయం — మోటుపల్లి .
- 13వ శతాబ్దంలో మోటుపల్లి రేవును సందర్శించిన వెనిస్ దేశస్థుడు — మార్కోపోలో.
- మోటుపల్లి రేవు ఏ జిల్లాలో గలదు — ప్రకాశం .
- మోటుపల్లి రేవు ద్వారా గంధం, ముత్యాలు, లోహాలు, పట్టు, మిరియాలు, దంతం వంటివి అన్నీ దేశాలకు ఎగుమతి అయ్యేవి.
- అమరావతి స్థూపం లా బౌద్ధ స్థూపం .
- అమరావతి స్టూపం ఏ జిల్లాలో కలదు — గుంటూరు .
- శాతవాహనులు అనుసరించిన మతం — బౌద్ద మతం .
- ఆంధ్ర శాతవాహనుల రాజధానులు — అమరావతి, ధరణి కోట .
- కొండపల్లి కోట ఏ జిల్లాలో గలదు — కృష్ణా జిల్లా .
- కొండపల్లి కోట విజయవాడ దగ్గరలో కలదు .
- కొండపల్లి కోట నిర్మించింది – ముసునూరి నాయకులు .
- ముసునూరి నాయకులు 1370 లో పతనం చెందిన తరువాత కొండపల్లి కోటను ఆక్రమించింది – కొండవీడు రెడ్డి రాజులు .
- కొండపల్లి ప్రాంతం కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ది .
- కొల్లేరు సరస్సు ఏ జిల్లాలో గలదు – పశ్చిమ గోదావరి
- కొల్లేరు సరస్సు గోదావరి – కృష్ణ నదుల మధ్య విస్తరించి ఉంది .
- కొల్లేరు సరస్సు మంచినీటి సరస్సు.
- కొల్లేరు సరస్సు వద్ద పక్షుల సంరక్షణా కేంద్రం ఎచట గలదు – ఆటపాక
- కోరింగ వన్యప్రణి సంరక్షణా కేంద్రం ఏ జిల్లాలో కలదు – తూర్పు గోదావరి
- భారతదేశంలో విస్తరించిన మడ అడవులలో కోరింగ ఎన్నవ స్థానంలో ఉంది – 2
- కోరింగ సంరక్షణా కేంద్రంలో అనేక రకాలైన మడచెట్లు 120 కన్నా ఎక్కువ సంఖ్యలో పక్షిజాతులు ఉన్నాయి.
- మడ ఆవరణ వ్యవస్థ అనునది సముద్రం లేదా మహాసముద్రంలో కలిసే నదీ ప్రదేశం.
- బొర్ర గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి — విశాఖపట్టణం
- బొర్ర గుహలు విశాఖపట్టణం జిల్లా అరకులోయలోని అనంతగిరి కొండలలో ఉన్నాయి .
- బొర్ర గుహలు పొడవు – 705 మీటర్లు .
- బొర్ర గుహలు లోతు – 80 మీటర్లు
- బొర్ర గుహలు సున్నపురాయి నిక్షేపాల మధ్య ప్రవహించిన ఏ నది కారణంగా ఏర్పడ్డాయి — గోస్తనీ .
- బొబ్బిలికోట ఏ జిల్లాలో కలదు – విజయనగరం
- 19వ శతాబ్దం మధ్య కాలంలో బొబ్బిలిలో ఈ కోట నిర్మించారు .
- బొబ్బిలి యుద్దం ఏ సంవత్సరంలో జరిగింది – 1757
- బొబ్బిలియుద్దం ఎవరెవరికి మద్య జరిగింది – విజయనగర రాజులు, బొబ్బిలి రాజులు .
- బొబ్బిలి యుద్దంలో మట్టికోట నాశనమైంది తరువాత అదే పేరుతో తిరిగి నిర్మించారు .
- బొబ్బిలి కి దగ్గరలోని గొల్లపల్లికి చెందిన సర్వసిద్ది వడ్రంగులు బొబ్బిలి వీణ తయారు చేస్తారు.
- తెలినీలాపురం మరియు తెలుకుంచి పక్షి సంరక్షణా కేంద్రలు ఏ జిల్లాలో కలవు — శీకాకుళం
- తెలినీలాపురం పక్షుల సంరక్షణా కేంద్రంలో ప్రతిసంవత్సరం సుమారు 3000 సంఖ్యలో పెలికాన్ పక్షులు, పెయింటెడ్ స్టార్క్ పక్షులు వలస వస్తాయి.
- పెలికాన్ పక్షులు, పెయింటెడ్ స్టార్క్ పక్షులు ఎచట నుండి వలస వస్తాయి — సైబీరియా
- ఈ పక్షులు సెప్టెంబర్ నుండి మార్షి నెలవరకూ సందర్శిస్తుంటాయి
11. మనమెక్కడ ఉన్నాం
- ప్రజలు కలసి నివసించే ప్రదేశాన్ని గ్రామం అంటారు.
- ఒక గ్రామం కలసి స్థిరపడిన వ్యక్తుల సమూహాన్ని కలిగి ఉంటుంది .
- దోనూబాయ్ గ్రామం శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఉంది .
- దోనూ బాయ్ గ్రామం తూర్పున ఉన్నవి — కొండల, ఫైనాఫిల్ తోటలు పడమర — మల్లి గ్రామం, ఉత్తరాన
- – ముత్యాలు గ్రామం, దక్షిణాన — సంభం గ్రామం ఉన్నాయి.
- సీతంపేట మండలానికి సరిహద్దున తూర్పున — కొత్తూరు మండలం, పడమరన — పాలకొండ మండలం , ఉత్తరాన — భూమిని మండలం, దక్షిణాన — బూర్జ మండలం
- శ్రీకాకుళం జిల్లాకు తూర్పున – బంగాళాఖాతం , పడమర, దక్షిణాన – విజయనరం జిల్లా , ఉత్తరాన – బరిసా రాష్ట్రం
- మన రాస్ట్రం – ఆంధ్ర ప్రదేశ్
- ఆంధ్రప్రదేశ్ రాజధాని – అమరావతి
- ఆంధ్రప్రదేశ్ కు తూర్పున – బంగాళాఖాతం ,పడమరన — కర్ణాటక ,ఉత్తరాన — ఒడిస్సా, తెలంగాణా, ఛత్తీస్ ఘడ్ దక్షిణాన – తమిళనాడు ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల జిల్లాలు – 13
- దేశంలో విస్తీర్ణంపరంగా ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంది
- గ్రామాల కలయిక వలన మండలం, మండలాల కలయిక వలన జిల్లా, జిల్లాల కలయిక వలన రాష్ట్రం ఏర్పడుతుంది .
12. జిల్లాలు — ప్రధాన కార్యాలయాలు
శ్రీకాకుళం – శ్రీకాకుళం
విజయనగరం – విజయనగరం
విశాఖపట్టణం – విశాఖపట్టణం
తూర్పు గోదావరి – కాకినాడ
పశ్చిమ గోదావరి – ఏలూరు
కృష్ణ – మచిలీపట్టణం
గుంటూరు – గుంటూరు
ప్రకాశం – ఒంగోలు
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు – నెల్లూరు
చిత్తూరు – చిత్తూరు
YSR కడప – కడప
అనంతపురం – అనంతపురం
కర్నూలు – కర్నూలు
ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన 26 జిల్లాలో — వాటి కార్యాలయాల వివరాలు .
శ్రీకాకుళం – శ్రీకాకుళం
పార్వతిపురం – పార్వతిపురం
విజయనగరం – విజయనగరం
విశాఖపట్నం – విశాఖపట్నం
అల్లూరి సీతా రామరాజు – పాడేరు
అనకాపల్లి – అనకాపల్లి
కాకినాడ – కాకినాడ
ఈస్ట్ గోదావరి – రాజమండ్రి
కోనసీమ – అమలాపురం
ఏలూరు – ఏలూరు
వెస్ట్ గోదావరి – భీమవరం
NTR – విజయవాడ
కృష్ణ – మచిలీపట్నం
పల్నాడు – నరసరావ్ పేట
గుంటూరు – గుంటూరు
బాపట్ల – బాపట్ల
ప్రకాశం – ఒంగోల్
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు – నెల్లూరు
కర్నూల్ – కర్నూల్
నంద్యాల్ – నంద్యాల్
అనంతపూర్ – అనంతపూర్
శ్రీసత్య సాయి – పుట్టపర్తి
YSR – కడప
అన్నమయ్య – రాయచోటి
తిరుపతి – తిరుపతి
చిత్తూర్ – చిత్తూర్
- రాష్ట్రముల కలయిక వలన దేశం ఏర్పడుతుంది .
- మన దేశం పేరు – భారతదేశం
- భారతదేశ రాజధాని – న్యూడిల్లీ .
- భారత దేశంలో రాష్ట్రాలు – 28
- కేంద్ర పాలిత ప్రాంతాలు – 8
- భారతదేశం విస్తీర్ణ పరంగా ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది.
- జనాభా పరంగా భారతదేశం 2వ స్థానంలో ఉంది
- భారత దేశానికి తూర్పున – బంగాళాఖాతం ,పడమర — అరేబియా సముద్రం .,.ఉత్తరాన – హిమాలయ పర్వతాలు ,దక్షిణాన – హిందూ మహాసముద్రం ఉన్నాయి.
రాష్ట్రములు | రాజధానులు |
ఆంధ్రప్రదేశ్ | అమరావతి |
అరుణాచల్ ప్రదేశ్ | ఈటానగర్ |
అస్సాం | డిస్పూర్ |
బీహార్ | పాట్నా |
చత్తీస్ ఘడ్ | రాయ్ పూర్ |
గోవా | పనాజీ |
గుజరాత్ | గాంధీనగర్ |
హర్యానా | ఛండీగడ్ |
హిమాచల్ ప్రదేశ్ | సిమ్లా |
జార్కండ్ | రాంచీ |
కర్ణాటక | బెంగళూరు |
కేరళ | తిరువనంతపురం |
మధ్యప్రదేశ్ | భోపాల్ |
మహారాష్ట్ర | ముంబాయి |
మణిపుర్ | ఇంఫాల్ |
మేఘాలయ | షిల్లాంగ్ |
మిజోరాం | ఐజ్వాల్ |
నాగాలాండ్ | కొహిమా |
ఒడిశా | భువనేశ్వర్ |
పంజాబ్ | ఛండీగడ్ |
రాజస్థాన్ | జైపూర్ |
సిక్కిం | గ్యాంగ్ టక్ |
తమిళనాడు | చెన్నై |
త్రిపుర | అగర్హలా |
ఉత్తర ప్రదేశ్ | లక్నో |
ఉత్తరాఖండ్ | డెహ్రడూన్ |
పశ్చిమ బెంగాల్ | కోల్ కతా |
- కొన్ని దేశాలు కలసి ఏర్పరిచేది – ఖండం
- భూగోళం 3 వంతుల నీటితో నూ, ఒక వంతు భూభాగంతోనూ నిండి ఉంది
- భూగోళంపై ఉన్న భూభాగం మొత్తాన్ని 7 భాగాలుగా విభజించారు. ఈ భాగాలను ఖండాలు అంటారు
- ఖండాలు మొత్తం పా – 7
- ఖండాలన్నింటితో కలపిన భూమిని ప్రపంచం అంటారు.
- ఖండాలు – 1. ఆసియా 2 ఆఫ్రికా 3.ఉత్తర అమెరికా 4.దక్షిణ అమెరికా 5.అంటార్కిటికా 6.ఐరోపా 7.ఆస్టేలియా
- అతిపెద్ద ఖండం – ఆసియా
- అతి చిన్న ఖండం — ఆస్టేలియా
- మంచు ఖండం – అంటార్కిటికా
- చీకటి ఖండం — ఆఫ్రికా
- పక్షిఖండం — దక్షిణ అమెరికా
- భూగోళంపై ఉన్న జలభాగాన్ని 5 భాగాలు గా విభజించారు .
- ఈ 5 భాగాలను మహాసముద్రములు అంటారు.
1. పసిఫిక్ మహాసముద్రం
2. అట్లాంటిక్ మహాసముద్రం
3. హిందూ మహాసముద్రం
4. ఆర్కిటిక్ మహాసముద్రం
5. ఆంటార్కిటికా మహాసముద్రం
- మహాసముద్రలలో బాగా లోతైనది – పసిఫిక్ మహాసముద్రం
- భూమిపై ఉన్న బాగా దట్టమైన అరణ్యాలు కు ఉదాహరణ — ఆమెజాన్
- భూమి పై ఉన్న ఎత్తెన పర్వతాలుకు ఉదాహరణ — హిమాలయాలు
- భూమి పైన ఉన్న విశాలమైన ఎడారులు కు ఉదాహరణ — సహారా.
- భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు
- భూ భ్రమణానికి పట్టే సమయం – 24 గంటలు
- భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటారు.
- భూ పరిభ్రమణానికి పట్టే సమయం – 365¼ రోజులు.
- భూమి యొక్క చలనం వలన రాతిరి, పగలు ఏర్పడతాయి
- నక్షత్రముల గుంపును నక్షత్ర కూటమి లేదా నక్షత్ర రాశి అంటారు.
- నక్షత్రములు గుంపులుగా ఒక ఆకారంలో ఉంటాయి.
- చంద్రుని ఆకారం రోజు రోజుకు మారుతుంది. ఈ మార్పులను చంద్ర దశలు అంటారు .
- రాతిరి వేళ చందుడు పూర్తిగా గుండ్రంగా కనిపిస్తే ఆ రోజును ఏమంటారు — పార్ణమి
- చంద్రుడు కనిపించని రోజును ఏమంటారు — అమావాస్య .
0 Comments