. AP 6th Class Social Notes Unit-6 తొలి నాగరికతలు

Ticker

6/recent/ticker-posts

AP 6th Class Social Notes Unit-6 తొలి నాగరికతలు

AP 6th Class Social Notes తొలి నాగరికతలు

→ 19వ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర వేదకాలంలోనే ప్రారంభమైనదని విశ్వసించేవారు.

→ 1920 హరప్పా, మొహంజోదారో, ప్రాంతంలో జరిపిన తవ్వకాల వలన మనదేశ చరిత్ర రెండువేల సం॥రాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిసింది.

→ హరప్పా నాగరికత క్రీ.పూ. 2500-1700 సం||రాల మధ్య వికసించింది.

→ హరప్పా నాగరికత సుమారు 1500 ప్రదేశాలలో బయటపడింది.

→ హరప్పా నాగరికత కాలం నాటికి నగరాలన్నియు ప్రణాళికాబద్ధంగా నిర్మించబడినవి.

→ హరప్పా నగరంలో ఆరు పెద్ద ధాన్యాగారాలు మరియు కార్మికులకు నివాస సముదాయాలు కలవు.

→ లోథాల్ నగరంలో అతి పెద్ద నౌకాశ్రయం కలదు.

→ సింధు నాగరికత కాలంలో మంచి ప్రణాళికాబద్ధమైన భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ కలదు.

→ హరప్పా ప్రజలు ఎండిన మరియు బాగా కాల్చిన ఇటుకలతో ఇళ్ళు కట్టుకునేవారు.

→ పత్తి మరియు నూలు వస్త్రాలను నేయడం ఆ కాలంలలోని ప్రధాన వృత్తులు.

→ పత్తిని మొట్టమొదట పండించింది వీరే.

→ లోథాల్ నౌకాశ్రయం ద్వారా మెసపటోమియా, ఈజిప్టు మరియు ఇరాన్ దేశాలతో సింధూ ప్రజలు బాగా వ్యాపారం చేసేవారు.

→ వ్యవసాయం ప్రధాన వృత్తి. గోధుమ, బార్లీ, ఆముదాలు, బఠానీలు, కాయధాన్యాలు పండించేవారు.

→ నాట్యం, చదరంగం ఆడటం, సంగీతం, గోళీలు, పాచికలు ఆడటం సింధూ ప్రజల వినోదాలు.

→ సింధూ ప్రజలు పశుపతి (శివుడు) మరియు అమ్మతల్లిని పూజించేవారు.

AP 6th Class Social Notes Unit-6 తొలి నాగరికతలు

→ స్వస్తిక్ (ఈ) గుర్తును సాధారణంగా ఉపయోగించేవారు.

→ సింధూ ప్రజల లిపిని ఇంతవరకు అర్థం చేసుకోలేకపోయారు.

→ ప్రామాణికమైన తూనికలను, కొలతలను మొట్టమొదట ఉపయోగించింది హరప్పా ప్రజలే.

→ ఆర్యుల దండయాత్రలు సింధూ నాగరికత పతనానికి కారణమనే సిద్ధాంతం కలదు. అయితే ‘మార్టిమర్ వీలర్’ అనే చరిత్రకారుడు దీనిని అంగీకరించలేదు.

→ ఆర్యుల పుట్టుపూర్వోత్తరాల గురించి అనేక సిద్ధాంతాలు కలవు.

→ వేద సాహిత్యము ఆవిర్భవించిన కాలాన్ని వేదకాలం అందురు.

→ ఆర్యుల నాగరికత సింధూ మరియు సరస్వతి నదీ మైదాన ప్రాంతాలలో వికసించింది.

→ ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం వేద సాహిత్యం.

→ సంస్కృత భాషలో వేదమనగా ఉన్నతమైన జ్ఞానం, ఆత్మజ్ఞానమే వేదము.

→ వేదాలను శృతులు అని కూడా అంటారు.

→ వేద సాహిత్యములో నాలుగు ప్రముఖ వేదాలు కలవు, అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము.

AP 6th Class Social Notes Unit-6 తొలి నాగరికతలు

→ ఆధునిక కాలంలో స్వామి దయానంద సరస్వతి “వేదకాలానికే మరలా వెళ్ళాలి” అని పిలుపునిచ్చారు.

→ తొలి వేదకాలము క్రీ.పూ. 1500 – 1000 వరకు.

→ మలి వేదకాలము క్రీ.పూ. 1000 – 600 వరకు.

→ తొలి వేదకాలంలో సమాజానికి ప్రాథమిక అంగం కుటుంబం, తండ్రి కుటుంబానికి పెద్ద. తొలి వేదకాలంలో సమాజంలో స్త్రీలకు గౌరవం ఉండేది. స్త్రీలు వేదాధ్యాయనం చేసేవారు.

→ వాసా (ధోవతి) ఆదివాసా (శరీరము పై భాగానికి కప్పుకొనేది) ప్రస్తుతం మన వేషధారణను పోలి ఉండేవి.

→ మూడు రకాలైన సంగీత వాయిద్యాలు ఉపయోగించేవారు.

→ విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే గురుకులాలు ఉండేవి.

→ ఆర్యులు దేవుడు ఒక్కడే అని నమ్మేవారు.

→ తొలివేదకాలంలో ఎటువంటి వివక్షత లేదు.

→ ఆర్యుల తెగ నాయకుడిని ‘రాజన్’ అంటారు.

→ రాజుకు పరిపాలనా విషయములో సలహాలు ఇచ్చేందుకు ‘సభ’, ‘సమితి’ అను రెండు సభలు ఉండేవి.

→ మలివేదకాలంలో రాజు మరింత శక్తిమంతుడైనాడు, సభ, సమితులు తమ ప్రాధాన్యతను కోల్పోయాయి.

→ మలివేదకాలంలో ఆశ్రమ వ్యవస్థ, వర్ణవ్యవస్థ ప్రారంభమైనవి.

→ రామాయణం, మహాభారతం అనేవి రెండు భారతదేశ గొప్ప ఇతిహాసాలు.

→ రామాయణాన్ని ఆదికావ్యం అంటారు. దానిని సంస్కృతంలో వాల్మీకి రచించారు.

→ మహాభారతాన్ని వేదవ్యాసుడు రచించారు.

→ నాగరికత : మానవుని యొక్క సాంఘిక, సాంస్కృతిక రంగాలలో ఉన్నతమైన స్థితి.

→ ఉపఖండం : ఖండంలో ఉన్న విశాలమైన భాగం

→ వాణిజ్యం : వస్తువులు మరియు సేవల అమ్మకం మరియు కొనుగోలు చేసే ప్రక్రియ.

→ వేదాలు : హిందూ మత పవిత్ర గ్రంథాలు.

→ బ్రాహ్మణాలు : వేదాలపై విపులంగా చేసిన వ్యాఖ్యానాలు.

→ ఉపనిషత్తులు : హిందూ మతం యొక్క పవిత్ర గ్రంథాలు.

→ వస్తు మార్పిడి పద్ధతి : డబ్బుకు బదులు వస్తువులను పరస్పరం మార్చుకొనే విధానం.

→ అమ్మతల్లి : సింధూ ప్రజలు పూజించిన దేవత.

→ గొప్పస్నానవాటిక : ప్రజలు అందరూ స్నానాలు చేయడానికై విశాలమైన కొలను. ఇది మొహంజోదారోలో బయల్పడింది.

→ సరస్వతి నది : థార్ ఎడారిలో ఇంకిపోయిన నదినే సరస్వతి నది అంటారు. ఋగ్వేదంలో సరస్వతి నది గురించి పలుమార్లు ప్రస్తావించడం జరిగింది.

→ అరణ్యకాలు : విద్యావాదము, క్రతువులు, సంస్కారాల గురించి తెలియజేయునవి.

→ తొలి వేదకాలము : క్రీ.పూ. 1500 – 1000 వరకు

→ మలి వేదకాలము : క్రీ.పూ. 1000 – 600 వరకు

→ వాసా : వేదకాలంలోని ధోవతి (దుస్తులు)

→ ఆదివాసా : వేదకాలంలోని శరీరము పై భాగానిని కప్పుకొనేది.

→ రాజన్ : ఆర్యుల తెగ నాయకుడిని రాజన్ అంటారు.

→ సభ, సమితి : రాజుకు పరిపాలనా విషయములో సలహాలు ఇచ్చే రెండు సభలు.

→ సతీసహగమనం : భర్త మరణిస్తే అతనితో పాటు భార్యను కూడా చితిలో కాల్చడం.

→ బహుభార్యత్వము : ఒక మగవాడు ఒకరి కంటే ఎక్కువ భార్యలు కల్గి ఉండటం.

→ వేద కాలం : వేద సాహిత్యము ఆవిర్భవించిన కాలాన్ని వేదకాలం అందురు.

→ ఇతిహాసాలు : రామాయణం, మహాభారతం అనేవి భారతదేశ రెండు గొప్ప ఇతిహాసాలు.

Post a Comment

0 Comments